ఏపీలో గడచిన 24 గంటల్లో 31,743 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 162 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 30 కొత్త కేసుల్ని గుర్తించారు. తూర్పు గోదావరి జిల్లాలో 22, చిత్తూరు జిల్లాలో 19, గుంటూరు జిల్లాలో 17, విశాఖ జిల్లాలో 17 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో ఒక కేసు వెల్లడైంది. కరోనా కారణంగా రాష్ట్రంలో ఎవరూ మరణించలేదు. అదే సమయంలో 186 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,76,849 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,61,308 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,049 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఇప్పటివరకు 14,492 మంది మరణించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)