ఏపీలో గడచిన 24 గంటల్లో 1000కి దిగున కరోనా పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. 56,463 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, వారిలో 809 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 161 కరోనా కేసులు వెల్లడి కాగా, చిత్తూరు జిల్లాలో 153, నెల్లూరు జిల్లాలో 115 కేసులు గుర్తించారు. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 1 కేసు నమోదైంది. అదే సమయంలో 1,160 మంది కరోనా నుంచి కోలుకోగా, 10 మంది మృతి చెందారు. తాజా మరణాలతో కలిపి ఇప్పటిదాకా 14,186 కరోనా మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో నేటివరకు 20,51,133 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,25,805 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 11,142 మంది చికిత్స పొందుతున్నారు.
#COVIDUpdates: As on 01st October, 2021 10:00AM
COVID Positives: 20,48,238
Discharged: 20,22,910
Deceased: 14,186
Active Cases: 11,142#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/qRuqMQ3mtj
— ArogyaAndhra (@ArogyaAndhra) October 1, 2021
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)