ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటల్లో కొత్తగా 334 కరోనా కేసులు నమోదయ్యాయి. విశాఖ జిల్లాలో అత్యధికంగా 50 కేసులు నమోదు కాగా... కడప, విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో అత్యల్పంగా 4 కేసుల వంతున నమోదయ్యాయి. ఇదే సమయంలో 95 మంది కరోనా నుంచి కోలుకున్నారు. నెల్లూరు జిల్లాలో ఒకరు మృతి చెందారు. తాజా కేసులతో కలిపి ఏపీలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 20,77,942కి చేరుకున్నాయి. ఇప్పటి వరకు 20,61,927 మంది కరోనా నుంచి కోలుకోగా... 14,499 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,516 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

విజయనగరం జిల్లాలో ఒకే పాఠశాలలో ఉపాధ్యాయుడితో పాటు 19 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జిల్లాలోని కొత్త వలస జడ్పీ ఉన్నత పాఠశాలలో 60 మందికి పరీక్షలు చేయగా ఒక ఉపాధ్యాయుడు, 19 మంది విద్యార్థులకు కరోనా నిర్థారణ అయినట్లు అధికారులు తెలిపారు. దీంతో రెండు రొజుల పాటు స్కూలుకు సెలవు ప్రకటించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)