ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 31,712 కరోనా పరీక్షలు నిర్వహించగా, 432 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 87 కొత్త కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 61, కృష్ణా జిల్లాలో 60 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 6, కర్నూలు జిల్లాలో 6 కేసులు గుర్తించారు. అదే సమయంలో 586 మంది కరోనా నుంచి కోలుకోగా, ఐదుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,60,472 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,40,131 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 6,034 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,307కి పెరిగింది.
#COVIDUpdates: 17/10/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,57,577 పాజిటివ్ కేసు లకు గాను
*20,37,236 మంది డిశ్చార్జ్ కాగా
*14,307 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 6,034#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/oxCfZTOxeC
— ArogyaAndhra (@ArogyaAndhra) October 17, 2021
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)