Amaravati, Dec 20: ఏపీలో ఇటీవల కాలంలో 100కి దిగువన కరోనా రోజువారీ కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం అని చెప్పాలి. గడచిన 24 గంటల్లో 21,211 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 75 కొత్త కేసులు నమోదయ్యాయి. విశాఖ జిల్లాలో 17, చిత్తూరు జిల్లాలో 13, గుంటూరు జిల్లాలో 10 కేసులు వెల్లడయ్యాయి. కర్నూలు, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. మిగిలిన జిల్లాల్లో సింగిల్ డిజిట్ లో కొత్త కేసులు వెల్లడయ్యాయి.
అదే సమయంలో 154 మంది కరోనా నుంచి కోలుకోగా, గుంటూరు జిల్లాలో ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,75,879 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,59,882 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 1,517 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 14,480కి పెరిగింది.
#COVIDUpdates: 20/12/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,72,984 పాజిటివ్ కేసు లకు గాను
*20,56,987 మంది డిశ్చార్జ్ కాగా
*14,480 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,517#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/iV31XCloy8
— ArogyaAndhra (@ArogyaAndhra) December 20, 2021
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)