ఏపీలో గడచిన 24 గంటల్లో 44,516 కరోనా నిర్ధారణ పరీక్షలు చేపట్టగా 13,212 మందికి పాజిటివ్ గా తేలింది. విశాఖ జిల్లాలో 2,244 పాజిటివ్ కేసులు వెల్లడి కాగా, చిత్తూరు జిల్లాలో 1,585 కేసులు, అనంతపురం జిల్లాలో 1,235 కేసులు, శ్రీకాకుళం జిల్లాలో 1,230 కేసులు, గుంటూరు జిల్లాలో 1,054 కేసులు, నెల్లూరు జిల్లాలో 1,051 కేసులు గుర్తించారు. అదే సమయంలో 2,942 మంది కరోనా నుంచి కోలుకోగా, ఐదుగురు మరణించారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 14,532కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 21,53,268 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,74,600 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఏపీలో ప్రస్తుతం 64,136 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
#COVIDUpdates: 21/01/2022, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 21,50,373 పాజిటివ్ కేసు లకు గాను
*20,71,705 మంది డిశ్చార్జ్ కాగా
*14,532 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 64,136#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/t9W75WW762
— ArogyaAndhra (@ArogyaAndhra) January 21, 2022
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)