ఏపీలో గడచిన 24 గంటల్లో 40,266 శాంపిల్స్ పరీక్షించగా 14,502 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా విశాఖ జిల్లాలో 1,728 కొత్త కేసులు నమోదు కాగా, అనంతపురం జిల్లాలో 1,610 కేసులు, ప్రకాశం జిల్లాలో 1,597 కేసులు, కర్నూలు జిల్లాలో 1,551 కేసులు, కడప జిల్లాలో 1,492 కేసులు, నెల్లూరు జిల్లాలో 1,198 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 4,800 మంది కరోనా నుంచి కోలుకోగా, ఏడుగురు మృత్యువాతపడ్డారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 14,549కి పెరిగింది. ఏపీలో ఇప్పటివరకు 21,95,136 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,87,282 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 93,305 మంది చికిత్స పొందుతున్నారు.
#COVIDUpdates: 24/01/2022, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 21,92,241 పాజిటివ్ కేసు లకు గాను
*20,84,387 మంది డిశ్చార్జ్ కాగా
*14,549 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 93,305#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/QxDrp2c1BC
— ArogyaAndhra (@ArogyaAndhra) January 24, 2022
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)