ఏపీలో కరోనా వ్యాప్తి మరింత తగ్గుముఖం పట్టింది. రోజువారీ కేసుల సంఖ్య 200కి దిగువన నమోదైంది. గడచిన 24 గంటల్లో 14,249 కరోనా పరీక్షలు నిర్వహించగా, 182 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 70 కొత్త కేసులు నమోదు కాగా, కృష్ణా జిల్లాలో 24 కేసులు గుర్తించారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 950 మంది ఆరోగ్యవంతులు కాగా, చిత్తూరు జిల్లాలో ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,16,467 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 22,95,768 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,985 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,714కి పెరిగింది.
#COVIDUpdates: 21/02/2022, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 23,16,467పాజిటివ్ కేసు లకు గాను
*22,95,768 మంది డిశ్చార్జ్ కాగా
*14,714 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 5,985#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/EfABRhoc0r
— ArogyaAndhra (@ArogyaAndhra) February 21, 2022
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)