ఏపీలో గడచిన 24 గంటల్లో 19,432 కరోనా పరీక్షలు నిర్వహించగా, 253 మందికి పాజిటివ్ గా వెల్లడైంది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 40 కేసులు నమోదు కాగా, తూర్పు గోదావరి జిల్లాలో 39, పశ్చిమ గోదావరి జిల్లాలో 37 కేసులు గుర్తించారు. అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో ఒక పాజిటివ్ కేసు నమోదైంది. అదే సమయంలో 635 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,16,964 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 22,97,065 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 5,181 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,718కి పెరిగింది.
#COVIDUpdates: 23/02/2022, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 23,16,964 పాజిటివ్ కేసు లకు గాను
*22,97,065 మంది డిశ్చార్జ్ కాగా
*14,718 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 5,181#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/sdK16S28cu
— ArogyaAndhra (@ArogyaAndhra) February 23, 2022
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)