16వ రాష్ట్రపతి ఎన్నిక(President Election) పోలింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. పార్లమెంట్‌లోని రూమ్ 63లో ఈ పోలింగ్ ప్రారంభమైంది. ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్టీఏకు అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించిన వైసీపీ పార్టీ అధినేత, ఏపీ సీఎం జగన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనతో పాటు అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా, హోం శాఖ మంత్రి తానేటి వనిత వినియోగించుకున్నారు. వారితోపాటు ఏపీ అసెంబ్లీలో 174 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు వేయనున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)