ఖమ్మం నగరం అల్లీపురంలో గరికపాటి నాగరాజు అనే యువకుడు ఆదివారం గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా ఖమ్మంలో హార్ట్‌స్ట్రోక్‌తో మరో యువకుడు మరణించాడు.కాంగ్రెస్‌ నాయకుడు, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మానుకొండ రాధా కిషోర్‌ కుమారుడు శ్రీధర్‌(31) గుండెపోటుతో మృతిచెందాడు. సోమవారం ఉదయం జిమ్‌కు వెళ్లి వచ్చిన కాసేపటికే శ్రీధర్‌ ఛాతీలో నొప్పి వస్తుందని చెప్పాడు. ఈ క్రమంలో ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే శ్రీధర్‌ మరణించినట్లు వైద్యులు తెలిపారు.

Youth Dies of Heart Attack

News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)