Covid in TS: తెలంగాణలో మూడు నెలల తర్వాత ఒక్కసారిగా పెరిగిన కేసులు, గత 24 గంటల్లో 403 మందికి కరోనా, ఒక్క హైదరాబాద్ నుంచే 240 కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గత రెండు వారాలుగా కేసుల్లో పెరుగుదల కనిపించగా, మంగళవారం మాత్రం ఏకంగా 400 మార్కును దాటాయి. ఒక్కరోజులో 26,704 మందికి కరోనా పరీక్షలు చేయగా, 403 మంది వైరస్ బారిన పడ్డట్టు తేలింది. అందులో హైదరాబాద్లో 240, రంగారెడ్డి జిల్లాలో 103 మంది ఉన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో గత రెండు వారాలుగా కేసుల్లో పెరుగుదల కనిపించగా, మంగళవారం మాత్రం ఏకంగా 400 మార్కును దాటాయి. ఒక్కరోజులో 26,704 మందికి కరోనా పరీక్షలు చేయగా, 403 మంది వైరస్ బారిన పడ్డట్టు తేలింది. అందులో హైదరాబాద్లో 240, రంగారెడ్డి జిల్లాలో 103 మంది ఉన్నారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు ఏకంగా 1.5 శాతం నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
మూడున్నర నెలల తర్వాత ఇంతటిస్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆయన కరోనా బులెటిన్ విడుదల చేశారు. కాగా, ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 7.96 లక్షలకు చేరింది. ఒక్కరోజులో 145 మంది కోలుకోగా, ఇప్పటివరకు 7.90 లక్షల మంది కోలుకున్నారు. 2,375 క్రియాశీలక కేసులు ఉన్నాయి. 24 మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరారు. అందులో 12 మంది సాధారణ పడకలపై, ఏడుగురు ఆక్సిజన్పై, ఐదుగురు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.21.06.2022 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/p76KFG7BOb
— IPRDepartment (@IPRTelangana) June 21, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jun 22, 2022 03:14 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

