Telangana Assembly Session 2024: వీడియో ఇదిగో, మన్మోహన్ సింగ్ స్మారక దినాలు వదిలేసి రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్ళాడని తెలిపిన బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, చురక అంటించిన సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు
తెలంగాణ ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ప్రారంభమైంది.మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానాన్ని శాసన సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. సభ్యులంతా మన్మోహన్ సింగ్కు ఘన నివాళులు అర్పించారు.
Hyd, Dec 30: తెలంగాణ ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ప్రారంభమైంది.మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానాన్ని శాసన సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. సభ్యులంతా మన్మోహన్ సింగ్కు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్ స్మారక దినాలు వదిలేసి రాహుల్ గాంధీ న్యూ ఇయర్ వేడుకలకు వియత్నాం వెళ్లాడని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారు. దేశానికి మన్మోహన్ చేసిన సేవలను ప్రజలు ఎన్నటికీ మరిచిపోరని తెలిపారు. పీవీకి దక్కనటువంటి గౌరవం.. మన్మోహన్కు దక్కిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏలేటి మహేశ్వర్రెడ్డి వ్యాఖ్యలకు అభ్యంతరం తెలిపారు మంత్రి శ్రీధర్బాబు.దీంతో మహేశ్వర్రెడ్డి వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు.
ఇక మన్మోహన్ సింగ్ స్మారక దినాలు వదిలేసి రాహుల్ గాంధీ న్యూ ఇయర్ వేడుకలకు వియత్నాం వెళ్ళాడని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు స్పందించారు. కేటీఆర్ లాగా చక్కగా శాసన సభ సంప్రదాయాలకు అనుగుణంగా నివాళి అర్పించాలి కానీ రాజకీయాలకు దీన్ని వేదిక చేయకూడదు. ఈ సభాలో మన్మోహన్ సింగ్ గారికి మన గౌరవాన్ని చాటాలి.. అంతే కానీ వేరే అంశాల జోలికి మనం వెళ్తే ఆయనకు గౌరవం అందించదని కూనంనేని సాంబశివ రావు తెలిపారు.
Telangana Assembly Session 2024 Updates:
మన్మోహన్ సింగ్ స్మారక దినాలు వదిలేసి రాహుల్ గాంధీ న్యూ ఇయర్ వేడుకలకు వియత్నాం వెళ్ళాడని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి
ఏలేటి మహేశ్వర్ రెడ్డికి చురకలు అంటించిన సీపీఐ ఎమ్మెల్యే కునంనేని సాంబశివ రావు
కేటీఆర్ లాగా చక్కగా శాసన సభ సంప్రదాయాలకు… https://t.co/eBFn6w2ehk pic.twitter.com/PtrcThJpif
— Telugu Scribe (@TeluguScribe) December 30, 2024
శాసనసభలో స్వల్ప గందరగోళం...
👉దేశానికి మన్మోహన్ చేసిన సేవలను ప్రజలు ఎన్నటికీ మరిచిపోరు: ఏలేటి మహేశ్వర రెడ్డి
👉పీవీకి దక్కనటువంటి గౌరవం.. మన్మోహన్కు దక్కింది.
👉ఏలేటి మహేశ్వర్రెడ్డి వ్యాఖ్యలకు అభ్యంతరం తెలిపిన మంత్రి శ్రీధర్బాబు.
👉మహేశ్వర్రెడ్డి వ్యాఖ్యలు రికార్డుల నుంచి… pic.twitter.com/VNNpASwXag
— ChotaNews App (@ChotaNewsApp) December 30, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 30, 2024 12:30 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

