తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సూపర్ స్టార్ మహేశ్ బాబు, ఆయన భార్య నమ్రత శిరోద్కర్ కలిశారు. జూబ్లీహిల్స్ లోని రేవంత్ నివాసానికి వారు వెళ్లారు. తన ఇంటికి వచ్చిన మహేశ్ దంపతులను రేవంత్ సాదరంగా స్వాగతించారు. మహేశ్ కు శాలువా కప్పారు. మహేశ్ దంపతులకు పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా తెలంగాణ వరద బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్ కు భారీ విరాళాన్ని మహేశ్ అందించారు. రూ. 50 లక్షల చెక్ ను సీఎంకు అందజేశారు. ఏఎంబీ సినిమాస్ తరపున మరో రూ. 10 లక్షలను అందించారు. వరద బాధితులకు అండగా నిలిచి విరాళం అందించిన మహేశ్ కు ఈ సందర్భంగా సీఎం రేవంత్ అభినందనలు తెలిపారు. .పుష్ప 2 షూటింగ్‌ లో జానీ మాస్టర్‌ ఆమెను కొట్టాడు.. అల్లు అర్జున్ కు కూడా ఈ విషయం తెలుసు.. నటి మాధవీలత సంచలన కామెంట్స్ (వీడియో) 

Here's Video and Images

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)