Telangana: బీజేపీ పోస్టర్పై తొలిసారిగా కోమటిరెడ్డి ఫోటో, మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే
మొన్నటిదాకా మునుగోడు ఎమ్మెల్యేగా కొనసాగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడారు. మరికాసేపట్లో బీజేపీలో చేరిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన... త్వరలో జరగనున్న మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు.
మొన్నటిదాకా మునుగోడు ఎమ్మెల్యేగా కొనసాగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడారు. మరికాసేపట్లో బీజేపీలో చేరిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన... త్వరలో జరగనున్న మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. బీజేపీలోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరబోతున్న తరుణంలో ఆదివారం ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్టర్ను పోస్ట్ చేశారు. మునుగోడు సభకు వస్తున్న అమిత్ షాకు స్వాగతం చెబుతూ కోమటిరెడ్డి ఆ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో అమిత్ షాతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ల ఫొటోలను అమర్చిన కోమటిరెడ్డి...కింద తన బొమ్మను ఏర్పాటు చేశారు. వెరసి బీజేపీ పోస్టర్పై కోమటిరెడ్డి తొలిసారిగా తన ఫొటోను ముద్రించారు.
I heartily welcome Hon'ble @HMOIndia Sri @AmitShah ji to #MunugoduAthmaGauravaSabha
నేడు మునుగోడు ఆత్మ గౌరవ సభ కు రానున్న కేంద్ర హోం మంత్రి శ్రీ @AmitShahOffice గారికీ స్వాగతం - సుస్వాగతం 🙏 pic.twitter.com/h1E8qtOSyI
— Komatireddy Raj Gopal Reddy (@krg_reddy) August 21, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 21, 2022 05:28 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

