తెలంగాణలో గడచిన 24 గంటల్లో 26,842 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 135 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. జీహెచ్ఎంసీలో అత్యధికంగా 64 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 11 కేసులు గుర్తించారు. వనపర్తి, వికారాబాద్, నిజామాబాద్, నిర్మల్, నారాయణపేట, ములుగు, కొమరంభీం ఆసిఫాబాద్, కామారెడ్డి, జోగులాంబ గద్వాల్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, ఆదిలాబాద్ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 168 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,70,274 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,62,377 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,950 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,947కి పెరిగింది.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.24.10.2021 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/7Z0v46qHk5
— IPRDepartment (@IPRTelangana) October 24, 2021
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)