తెలంగాణలో గడచిన 24 గంటల్లో 35,659 కరోనా పరీక్షలు నిర్వహించగా, 144 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీలో అత్యధికంగా 54 కొత్త కేసులు వెల్లడి కాగా, రంగారెడ్డి జిల్లాలో 12 కేసులు గుర్తించారు. సంగారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ములుగు, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో కొత్తకేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 161 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,74,181 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,66,509 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,694 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,978కి పెరిగింది.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.18.11.2021 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/1pQkG3KXTq
— IPRDepartment (@IPRTelangana) November 18, 2021
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)