తెలంగాణలో గడచిన 24 గంటల్లో 45,418 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 208 మందికి పాజిటివ్ గా వెల్లడైంది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాదులో 62 కొత్త కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 14, మంచిర్యాల జిల్లాలో 14, రంగారెడ్డి జిల్లాలో 13 కేసులు గుర్తించారు. వికారాబాద్, నిర్మల్, నారాయణపేట, కొమరంభీం ఆసిఫాబాద్, జోగులాంబ గద్వాల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.అదే సమయంలో 201 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,69,163 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,61,294 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 3,929 మంది చికిత్స పొందుతున్నారు. ఇక కరోనా మృతుల సంఖ్య 3,940కి పెరిగింది.

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)