తెలంగాణలో గడచిన 24 గంటల్లో 46,193 కరోనా పరీక్షలు నిర్వహించగా, 220 మందికి పాజిటివ్ గా వెల్లడైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 67 కొత్త కేసులు నమోదు కాగా, వరంగల్ అర్బన్ జిల్లాలో 18, రంగారెడ్డి జిల్లాలో 15 కేసులు గుర్తించారు. నిర్మల్, నారాయణపేట, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 244 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,66,183 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,57,665 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 4,599 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మరణాల సంఖ్య 3,919కి పెరిగింది.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.01.10.2021 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/NelxeB9xSf
— IPRDepartment (@IPRTelangana) October 1, 2021
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)