తెలంగాణలో గడచిన ఒక్కరోజులో 21,679 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 274 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీలో భారీస్థాయిలో 212 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 18, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 17 కేసులు వెల్లడయ్యాయి. పలు జిల్లాల్లో కొత్తకేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 227 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,82,489 పాజిటివ్ కేసులు నమోదు కాగా ... 6,74,680 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,779 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 4,030కి పెరిగింది.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.02.01.2022 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/J3Chx1z1FA
— IPRDepartment (@IPRTelangana) January 2, 2022
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)