తెలంగాణలో గత 24 గంటల్లో 324 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో జీహెచ్ఎంసీ పరిధిలో 79 కేసులు నిర్ధారణ అయ్యాయి. మహమ్మారి కారణంగా ఒకరు మృతి చెందారు. ఇదే సమయంలో 280 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,62,526కి చేరుకుంది. ఇక మొత్తం 6,53,302 మంది కరోనా పేషెంట్లు కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా కారణంగా 3,899 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 73,323 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. రాష్ట్రంలో రికవరీ రేటు 98.60 శాతంగా ఉందని, మరణాల రేటు 0.58 శాతంగా ఉందని తెలంగాణ ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 5,325 యాక్టివ్ కేసులు ఉన్నాయి
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.15.09.2021 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/g0Up8rIofE
— IPRDepartment (@IPRTelangana) September 15, 2021
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)