తెలంగాణలో గడచిన 24 గంటల్లో 81,203 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,821 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 537 కేసులు నమోదు కాగా, ఖమ్మం జిల్లాలో 245, రంగారెడ్డి జిల్లాలో 226 కేసులు గుర్తించారు. అదే సమయంలో 4,298 మంది కరోనా నుంచి కోలుకోగా, 23 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 5,60,141 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 5,18,266 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 38,706 మందికి చికిత్స జరుగుతోంది. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 3,169కి పెరిగింది.

Here' s Telangana Covid Report

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)