తెలంగాణలో గడచిన 24 గంటల్లో 81,405 కరోనా పరీక్షలు నిర్వహించగా, 748 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 121 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. కొమరంభీం ఆసిఫాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 1,492 మంది కరోనా నుంచి కోలుకోగా, 8 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,20,613 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 6,02,676 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 14,302 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటిదాకా కరోనాతో మొత్తం 3,635 మంది మరణించారు. తెలంగాణలో కరోనా రికవరీ రేటు 97.10 శాతానికి పెరిగింది.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.27.06.2021 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/wrIBzWtsTq
— IPRDepartment (@IPRTelangana) June 27, 2021
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)