Ragging at Gandhi Hospital: గాంధీ ఆస్పత్రిలో ర్యాగింగ్ కలకలం.. పది మంది విద్యార్థులు సస్పెండ్
సికింద్రాబాద్ గాంధీ వైద్యకళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థులను ర్యాగింగ్ చేసిన ఘటనలో పది మంది సీనియర్ విద్యార్థులను ఏడాది పాటు సస్పెండ్ చేశారు.
Hyderabad, Sep 12: సికింద్రాబాద్ (Secunderabad) గాంధీ వైద్యకళాశాలలో (Gandhi Hospital) ర్యాగింగ్ (Ragging) కలకలం రేపింది. కళాశాలలో ఎంబీబీఎస్ (MBBS) మొదటి సంవత్సరం విద్యార్థులను ర్యాగింగ్ చేసిన ఘటనలో పది మంది సీనియర్ విద్యార్థులను ఏడాది పాటు సస్పెండ్ చేశారు. కొత్తగా చేరిన విద్యార్థులను కొంతమంది సీనియర్లు రాత్రిళ్లు హాస్టల్ గదులకు పిలిపించి వారం నుంచి ర్యాగింగ్ చేస్తున్నారు. దీనిపై బాధితులు కళాశాల యాంటీ ర్యాగింగ్ కమిటీతోపాటు యూజీసీ యాంటీ ర్యాగింగ్ సెల్ కు ఫిర్యాదు చేశారు. అంతర్గత విచారణలో పది మంది సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేసినట్లు నిర్థారణ కావడంతో వారిని కళాశాల, వసతిగృహం నుంచి సస్పెండ్ చేసినట్లు వైద్యవిద్య డైరెక్టర్ రమేశ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
Ten Senior #MBBS Students at Gandhi Medical College #Suspended for a year for #Ragging https://t.co/oHpuE3cSbT#MedicalStudents #Medical #MedTwitter #college
— The News Caravan (@TheNewsCaravan) September 11, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 12, 2023 10:21 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

