Kabul Suicide Blast: సూసైడ్ బాంబ్ బ్లాస్ట్తో వణికిన కాబూల్, చిన్నారి సహా ఆరుగురు పౌరులు మృతి, ఆప్ఘన్లో విదేశాంగ మంత్రిత్వ శాఖ సమీపంలో ఘటన
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లో సూసైడ్ బాంబ్ బ్లాస్ట్ కలకలం రేపింది. ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ సమీపంలో జరిగిన ఈ సంఘటనలో ఆరుగురు మరణించారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నట్లు వార్తా సంస్థలు పేర్కొన్నాయి.
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లో సూసైడ్ బాంబ్ బ్లాస్ట్ కలకలం రేపింది. ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ సమీపంలో జరిగిన ఈ సంఘటనలో ఆరుగురు మరణించారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నట్లు వార్తా సంస్థలు పేర్కొన్నాయి. ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సమీపంలోని ఒక వ్యాపార కేంద్రం ముందు సోమవారం పేలుడు సంభవించింది. మాలిక్ అస్గర్ స్క్వేర్లోని సెక్యూరిటీ చెక్పాయింట్ వద్ద ఓ బాంబర్ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు.
బాంబులతో తనను తాను పేల్చేసుకున్నాడు. ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సమీపంలో మూడు నెలల్లో రెండో ఆత్మాహుతి దాడి జరిగినట్లు భద్రతా దళాలు పేర్కొన్నాయి. కాబూల్లోని ఇటలీకి చెందిన ప్రభుత్వేతర సంస్థకు చెందిన ఎమర్జెన్సీ ఆసుపత్రికి రెండు మృతదేహాలతోపాటు గాయపడిన 12 మందిని తరలించారు. సూసైడ్ బ్లాస్ట్లో మరణించిన ఆరుగురూ పౌరులేనని ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం వెల్లడించింది. గాయపడిన వారిలో ముగ్గురు ఆఫ్ఘన్ భద్రతా సిబ్బంది కూడా ఉన్నట్లు తెలిపింది.
Here's Update
In #Kabul, there was an explosion outside the building of the Ministry of Foreign Affairs of #Afghanistan.
Two people died and 12 others were wounded. pic.twitter.com/8Kn96Zga7L
— NEXTA (@nexta_tv) March 27, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 27, 2023 08:13 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

