Abdul Razzaq: పాక్ క్రికెటర్లతో పోటీ పడేంత సీన్ భారత క్రికెటర్లకు ఉందా, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ మాజీ ఆల్రౌండర్ అబ్దుల్ రజాక్
ఇప్పటి వరకూ ఏ వరల్డ్కప్లోనూ ఇండియాపై ఒక్క మ్యాచ్ కూడా గెలవని పాకిస్థాన్.. దాని ఆటగాళ్లు భారత్ కన్నా ఎక్కువ టాలెంట్ కలిగి ఉన్నారని (Don't think India can compete with Pakistan) ఆ దేశ మాజీ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్ (Former all-rounder Abdul Razzaq) సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటి వరకూ ఏ వరల్డ్కప్లోనూ ఇండియాపై ఒక్క మ్యాచ్ కూడా గెలవని పాకిస్థాన్.. దాని ఆటగాళ్లు భారత్ కన్నా ఎక్కువ టాలెంట్ కలిగి ఉన్నారని (Don't think India can compete with Pakistan) ఆ దేశ మాజీ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్ (Former all-rounder Abdul Razzaq) సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్ టీమ్లో ఉన్న టాలెంట్ను చూస్తే.. ఇండియన్ టీమ్ కనీస పోటీ కూడా ఇవ్వలేదని అన్నాడు. రానున్న టీ20 వరల్డ్కప్లో భాగంగా దుబాయ్లో జరగబోయే మ్యాచ్తోనే వరల్డ్కప్ సమరానికి తెరలేవనుంది. ఈ నేపథ్యంలో పాక్ మాజీ ప్లేయర్స్ అప్పుడే భారత్ తో మాటల యుద్ధానికి తెర తీశారు. టీమిండియాను మానసికంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు.
పాకిస్థాన్తో ఇండియా పోటీ పడుతుందని అనుకోవడం లేదు. పాకిస్థాన్లో ఉన్న టాలెంట్ చాలా భిన్నమైనది. ఇలాంటి సమయంలో ఇండియా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్లు లేకపోవడం క్రికెట్కు మంచిది కాదు. దాయాదుల మ్యాచ్ ఆసక్తిగా ఉండేది. ప్లేయర్స్ ఎంత ఒత్తిడి తట్టుకునే వాళ్లో తేలిపోయేది. అది ఇప్పుడు మిస్ అవుతున్నాం. రెండు టీమ్స్ మధ్య మ్యాచ్లు జరిగి ఉంటే.. పాకిస్థాన్లో ఎంత టాలెంట్ ఉందో, అది ఇండియాలో ఎందుకు లేదో తెలిసేది అని రజాక్ అన్నాడు.
ఇక భారత దేశానికి తొలి ప్రపంచ కప్ అందించిన కపిల్ దేవ్ కంటే కూడా ఇమ్రాన్ ఖానే గొప్ప ప్లేయర్ అనీ అన్నాడు. వసీం అక్రమ్లాంటి ప్లేయర్ అయితే ఇప్పటి వరకూ ఇండియాలో లేడని రజాక్ అభిప్రాయపడ్డాడు. ఇండియా కూడా మంచి టీమే. కాదని కాదు. ఆ టీమ్లోనూ మంచి ప్లేయర్స్ ఉన్నారు. కానీ సామర్థ్యం పరంగా చూసుకుంటే కపిల్ కంటే ఇమ్రాన్ చాలా బెటర్. ఇక వసీం అక్రమ్లాంటి ప్లేయర్ అయితే లేనే లేడు అని రజాక్ అన్నాడు. అయితే అసలు విషయం ఏంటంటే.. ఇప్పటి వరకూ ఏ వరల్డ్కప్లోనూ ఇండియాపై పాకిస్థాన్ గెలవలేదు.
ఓ ఛానల్లో "పాకిస్తాన్ లాంటి పేస్ బౌలర్లు లేదా ఆల్ రౌండర్లు భారతదేశంలో ఉన్నారా లేదా మ్యాచ్ లేదని మీరు భావిస్తున్నారా? అని రిపోర్టర్ అడిగారు. దానికి రజాక్ స్పందిస్తూ..పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రతిభ ప్రత్యేకమైనది, ఇది భారత క్రికెట్ జట్టుకు లేదు. "పాకిస్తాన్తో భారతదేశం పోటీ పడగలదని నేను అనుకోను. పాకిస్తాన్లో ఉన్న ప్రతిభ పూర్తిగా భిన్నమైనది అని అన్నారు.
కాగా రజాక్ వ్యాఖ్యలు ప్రస్తుత భారతదేశం, పాకిస్తాన్ క్రికెటర్లకు మాత్రమే పరిమితం కాదు. పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ లెక్కల ప్రకారం, సంవత్సరాలుగా, పాకిస్తాన్ ఎల్లప్పుడూ భారతదేశం కంటే మెరుగైన ఆటగాళ్లను తయారు చేసింది, మరియు రెండు దేశాల కోసం గేమ్ ఆడిన అత్యుత్తమ వ్యక్తుల మధ్య పోలికలను గీయడం ద్వారా అతని పాయింట్ను హైలైట్ చేసింది. పాకిస్తాన్తో పోటీ పడకూడదనే భారత నిర్ణయం వెనుక ఇవన్నీ కారణాలని రజాక్ పేర్కొన్నారు.
ఇండియాలో కూడా మంచి టీమ్ ఉంది, నేను వేరే ఏమీ చెప్పడం లేదు. వారు కూడా మంచి ఆటగాళ్లు ఉన్నారు. కానీ మీరు దానిని తెలివిగా చూస్తే, మాకు ఇమ్రాన్ ఖాన్ ఉన్నారు, వారికి కపిల్ దేవ్ ఉన్నారు. మీరు పోల్చి చూస్తే, ఇమ్రాన్ ఖాన్ రికార్డు చాలా మెరుగ్గా ఉంది. అప్పుడు మాకు వసీం అక్రమ్ ఉన్నాడు, వారి దగ్గర ఆ క్యాలిటీ ఉన్న ప్లేయర్ లేడు, "అన్నారు
"మాకు జావేద్ మియాందాద్ ఉన్నాడు, వారికి గవాస్కర్ ఉన్నాడు. పోలిక లేదు. అప్పుడు మాకు ఇంజమామ్, యూసఫ్, యూనిస్, షాహిద్ అఫ్రిది ఉన్నారు ... వారికి ద్రవిడ్, సెహ్వాగ్ ఉన్నారు. మొత్తంగా చూస్తే, పాకిస్తాన్ ఎల్లప్పుడూ మంచి ఆటగాళ్లను తయారు చేసింది. ఇవన్నీ పెద్ద కారణాలే. అందుకే భారత్ మాకు వ్యతిరేకంగా ఆడటానికి (They don't want to play against us) ఇష్టపడదన్నాడు.కాగా ఇంగ్లాండ్లో 2019 ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో తొలిసారిగా టీ 20 ప్రపంచకప్లో అక్టోబర్ 24 న భారత్, పాకిస్తాన్ తలపడతాయి.
(The above story first appeared on LatestLY on Oct 05, 2021 03:17 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

