COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 3 వేల మందికి పాజిటివ్, 4 వేలకు మందికి పైగా రికవరీ, రాష్ట్రంలో 27 వేల దిగువకు ఆక్టివ్ కేసుల సంఖ్య
Coronavirus in AP (Photo Credits: PTI)

Amaravati, October 27:  దేశంలో లాక్డౌన్ 5 మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం నవంబర్ 30 వరకు పొడగించింది. దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు తగ్గుతున్నప్పటికీ కొవిడ్ వ్యాప్తి మాత్రం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. ప్రతిరోజు నమోదయ్యే కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ వైరస్ ఉధృతి మాత్రం గతంలో కంటే చాలావరకు తగ్గుముఖం పట్టింది.

గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా  74,757 మంది శాంపుల్స్ ను పరీక్షించగా మరో 2901 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య 8,11,825కు చేరింది,  వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 8,08,930గా ఉంది.

గడిచిన ఒక్కరోజులో అత్యధికంగా పాజిటివ్ కేసులు  పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 555,  తూర్పు గోదావరి జిల్లా నుంచి 464,  కృష్ణా నుంచి  411  మరియు గుంటూరు జిల్లా నుంచి 383  కేసుల చొప్పున నమోదయ్యాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.

AP's COVID Update:

Status of positive cases of #COVID19 in Andhra Pradesh

గడిచిన ఒక్కరోజులో  మరో 19 కరోనా మరణాలు నమోదయ్యాయి. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 6625కు పెరిగింది.

మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 4,352 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.  ఇలా ఇప్పటివరకు 7,77,900 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 27,300 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.