AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం, స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నిరసన చేపట్టిన టీడీపీ, చంద్రబాబు అరెస్టుపై చర్చించాల్సిందే అంటూ పట్టుబట్టిన టీడీపీ నేతలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Sessions) రసాభాసగా మారాయి. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్ (CBN Arrest) కు వ్యతిరేకంగా టీడీపీ (TDP Protest) ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. చంద్రబాబు అరెస్టుపై చర్చ జరపాలంటూ వాయిదా తీర్మానం ఇచ్చారు. వెంటనే చర్చ ప్రారంభించాలంటూ టీడీపీ నేతలు నినాదాలు చేపట్టారు.
Vijayawada, SEP 21: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Sessions) రసాభాసగా మారాయి. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్ (CBN Arrest) కు వ్యతిరేకంగా టీడీపీ (TDP Protest) ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. చంద్రబాబు అరెస్టుపై చర్చ జరపాలంటూ వాయిదా తీర్మానం ఇచ్చారు. వెంటనే చర్చ ప్రారంభించాలంటూ టీడీపీ నేతలు నినాదాలు చేపట్టారు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు.
టీడీపీ ఎమ్మెల్యేల నినాదాల మధ్యనే ప్రశ్నోత్తరాలను కొనసాగిస్తున్నారు స్పీకర్ తమ్మినేని. ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ స్పీకర్ ఛైర్ వద్దకు చేరుకున్న టీడీపీ నేతలు...సభా కార్యక్రమాలకు అడ్డపడ్డారు.
(The above story first appeared on LatestLY on Sep 21, 2023 09:20 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

