CM Chandrababu Srishailam Tour: రేపు శ్రీశైలం మహా క్షేత్రానికి చంద్రబాబు.. సీప్లేన్ ద్వారా చేరుకోనున్న ఏపీ సీఎం

శ్రీశైలం మహా క్షేత్రంలో శనివారం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. సీప్లేన్ ద్వారా క్షేత్రానికి చేరుకోనున్న బాబు స్వామివారిని దర్శించుకోనున్నారు.

CM Chandrababu Srishailam Tour: రేపు శ్రీశైలం మహా క్షేత్రానికి చంద్రబాబు.. సీప్లేన్ ద్వారా చేరుకోనున్న ఏపీ సీఎం
Chandrababu Naidu Review (Photo/X/TDP)

Srishailam, Nov 8: శ్రీశైలం (Srishailam) మహా క్షేత్రంలో శనివారం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu) పర్యటించనున్నారు. సీప్లేన్ ద్వారా క్షేత్రానికి చేరుకోనున్న బాబు స్వామివారిని దర్శించుకోనున్నారు. సీఎం రాక నేప‌థ్యంలో ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ పరిశీలించారు. ఇందులో భాగంగా రోప్ వే ఎంట్రీ , పాతాళ గంగ బోటింగ్, ఆలయ ప్రాంగణంతో పాటు ప‌లు ప్ర‌దేశాల‌ను ప‌రిశీలించారు. ఏర్పాట్లు ముమ్మ‌రం చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం నేడు.. ఈ సందర్భంగా ఆవగింజలతో రేవంత్ చిత్రాన్ని ఆవిష్కరించిన చిత్రకారుడు రాము (వీడియో)

కట్టుదిట్టమైన ఏర్పాట్లు

చంద్రబాబు పర్యటన  నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్ల పరిశీలనలో జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్‌ తో పాటు ఏఎస్‌ఎల్ బృందం, ఈవో చంద్రశేఖర్ రెడ్డి, డీఎస్పీ రామాంజి నాయక్, సీఐ ప్రసాద్ రావు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మేడపైన కుండీల్లో గంజాయి మొక్కలు పెంచుతున్న వ్యక్తి అరెస్ట్.. వరంగల్ లో ఘటన (వీడియోతో)

(The above story first appeared on LatestLY on Nov 08, 2024 10:48 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).