
Amaravati, November 6: ఆంధ్రప్రదేశ్లో కొవిడ్19 కేసులు ఇటీవల కాలంగా కొంత తగ్గినప్పటికీ వైరస్ వ్యాప్తి మాత్రం ఇప్పటొకీ కొనసాగుతోంది. మరోవైపు రికవరీలు కూడా అదే స్థాయిలో నమోదవుతుండటంతో ఆక్టివ్ కేసుల సంఖ్యలో భారీ మార్పులు ఏం జరగడం లేదు.
గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 79,601 మంది శాంపుల్స్ ను పరీక్షించగా మరో 2,410 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య 8,38,363కు చేరింది. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 8,35,468గా ఉంది.
గడిచిన ఒక్కరోజులో అత్యధికంగా పాజిటివ్ కేసులు తూర్పు గోదావరి జిల్లా నుంచి 401, గుంటూరు జిల్లా నుంచి 323, కృష్ణా నుంచి 298 మరియు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కూడా 298 కేసుల చొప్పున నమోదయ్యాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.
AP's COVID Update:

గడిచిన ఒక్కరోజులో మరో 11 కరోనా మరణాలు నమోదయ్యాయి. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 6768కు పెరిగింది.
మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 3,452 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 8,09,770 మంది కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 21,825 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది.