AP Coronavirus: మాస్క్ ధరించండి, జరిమానా తప్పించుకోండి, మాస్క్ మస్ట్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళుతున్న ఏపీ పోలీసులు, తాజాగా 993 మందికి కరోనా, ముగ్గురు మృతితో 7,213కి చేరుకున్న మొత్తం మరణాల సంఖ్య
Guntur police (Photo-Twitter)

Amaravati, Mar 31: ఏపీలో గత 24 గంటల్లో 30,851 మందికి టెస్టులు నిర్వహించగా 993 మందికి పాజిటివ్ గా నిర్ధారణ (AP Coronavirus) అయింది. గుంటూరు జిల్లాలో 198 కేసులు, చిత్తూరు జిల్లాలో 179, కృష్ణా జిల్లాలో 176, విశాఖపట్నం జిల్లాలో 169 కేసులు నమోదయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో అత్యల్పంగా 12 కేసులు నిర్ధారణ అయ్యాయి. 24 గంటల్లో గుంటూరు, కృష్ణా, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి (Covid Deaths) చెందారు. ఇదే సమయంలో 480 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

తాజా గణాంకాలతో కలిపి కరోనా వల్ల ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 7,213కి చేరుకుంది. ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 9 లక్షలను దాటింది. మొత్తం 9,00,805 మంది కరోనా (Coronavirus) బారిన పడగా... 8,86,978 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,614 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమిస్తోంది. మాస్క్ ధరించని వారికి భారీ జరిమానాలు విధిస్తోంది.

రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు పోలీస్‌ యంత్రాంగం చేపట్టిన ప్రత్యేక కార్యాచరణ ఫలితాన్నిస్తోంది. ఎవరైనా మాస్క్‌ ధరించకుండా రోడ్డెక్కితే.. తొలుత అవగాహన కల్పించడం ఆపై జరిమానా విధించడం చేస్తుండటంతో ‘మాస్క్‌ మస్ట్‌’ అనే దిశగా ఏపీ సాగుతోంది. స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా అన్ని జిల్లాల్లోనూ ఎస్పీలు, నగర పోలీస్‌ కమిషనర్లు, డీఐజీలు, ఐజీలు సైతం రోడ్డెక్కి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

ఏప్రిల్‌,మే నెలలో రాబోయే పథకాల వివరాలు ఇవే, ఏప్రిల్ 1న కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోనున్న ఏపీ సీఎం వైయస్ జగన్, వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ముమ్మరంగా చేపట్టాలని అధికారులకు ఆదేశాలు

ప్రతిరోజు సాయంత్రం 4.30 గంటల నుంచి 6.30 గంటల వరకు రెండు గంటలపాటు మొత్తం పోలీస్‌ యంత్రాంగం రోడ్లపైనే ఉంటోంది. మాస్క్‌ ధరించకుండా ప్రయాణించే వారిని గుర్తించి వారికి అవగాహన కల్పించడం, జరిమానాలు విధించడం వంటి కార్యక్రమాల్ని పెద్దఎత్తున నిర్వహిస్తున్నారు. మాస్క్‌ ధరించే విషయంలో పోలీసులు సైతం మినహాయింపు లేదనే విషయాన్ని స్పష్టం చేస్తూ ఓ సీఐకి సైతం జరిమానా విధించారు.

గుంటూరు లాడ్జి కూడలిలో స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా ఎస్పీ అమ్మిరెడ్డి పరిశీలనకు వెళ్లారు. ఆ సమయంలో తుళ్లూరు ట్రాఫిక్‌ సీఐ మల్లికార్జునరావు మాస్క్‌ ధరించకుండా వెళ్తుండటంతో ఆపి మాస్కు ఎందుకు ధరించలేదని ప్రశ్నించారు. హడావుడిలో మర్చిపోయానని బదులిచ్చిన సీఐ మల్లికార్జునరావుకు జరిమానా విధించిన ఎస్పీ అమ్మిరెడ్డి ఆయనకు స్వయంగా మాస్క్‌ తొడిగారు.

సెకండ్ వేవ్‌లో యూత్‌ని టార్గెట్ చేసిన కరోనా, 20-39 సంవత్సరాల వయస్సు వారిపై అధికంగా కోవిడ్ వైరస్ ప్రభావం, అజాగ్రత్తగా ఉంటే మొదటి వేవ్ కన్నా ఎక్కువ మరణాలు సంభవిస్తాయంటున్న బెంగుళూరు వైద్యులు

కోవిడ్‌ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నాం. ఇందుకోసం యంత్రాంగం మొత్తం మూడు రోజులుగా రోడ్లపైనే ఉంటూ కోవిడ్‌ నిబంధనల అమలుకు కృషి చేస్తున్నారు. వీటిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దు. వేడుకలు, విందులు, వినోదాలు వంటి వాటిని సాధ్యమైనంత తక్కువ మందితో జరుపుకోవాలి. వీలైతే వాటిని కొన్ని రోజులు వాయిదా వేసుకోవడం మరీ మంచిది. బయటకి వస్తే తప్పనిసరిగా మాస్క్‌ ధరించడం, శానిటైజ్‌ చేసుకోవడం, భౌతిక దూరం పాటించటం వంటి వాటిని అలవాటుగా మార్చుకోవాలి. దుకాణదారులు సైతం వినియోగదారులు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి. పాఠశాలలు, కళాశాలల్లో భౌతిక దూరం ఉండేలా విద్యార్థులను కూర్చోబెట్టాలని సవాంగ్ ఆదేశాలు జారీ చేశారు.