AP Counting Day Arrangements: కౌంటింగ్ కు ఏపీ సన్నద్ధం.. పోలింగ్ రోజున రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో హింస చెలరేగిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్.. స్ట్రాంగ్ రూమ్ ల వద్ద కట్టుదిట్టమైన చర్యలు.. కేంద్రం నుంచి రాష్ట్రానికి మరో 20 కంపెనీల బలగాలు.. కౌంటింగ్ రోజున డ్రై డే
జూన్ 4న జరుగనున్న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కు ఆంధ్రప్రదేశ్ సర్వం సిద్ధం అవుతున్నది. పోలింగ్ రోజున రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో హింస చెలరేగిన విషయం తెలిసిందే.
Vijayawada, May 28: జూన్ 4న జరుగనున్న సార్వత్రిక ఎన్నికల (Loksabha Elections) కౌంటింగ్ కు (Counting) ఆంధ్రప్రదేశ్ (AP) సర్వం సిద్ధం అవుతున్నది. పోలింగ్ రోజున రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం లెక్కింపు సందర్భంగా పటిష్ఠ చర్యలు చేపడుతున్నట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. సమస్యాత్మక, సున్నితమైన ప్రాంతాలు, నియోజకవర్గాల్లో అదనపు బలగాలను మోహరిస్తున్నట్టు చెప్పారు. స్ట్రాంగ్ రూమ్ ల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటుచేసినట్టు తెలిపారు. కౌంటింగ్ రోజున డ్రైడే అమలు చేస్తున్నామని తెలిపారు.
మరో 20 కంపెనీల బలగాలు
భద్రతా చర్యల్లో భాగంగా రాష్ట్రానికి మరో 20 కంపెనీల బలగాలను ప్రత్యేకంగా కేటాయించారని వివరించారు. పోలింగ్ తర్వాత పల్నాడు జిల్లాలో రేకెత్తిన అల్లర్లను అదుపులోకి తెచ్చినట్టు మీనా వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ నడుస్తున్నట్టు వెల్లడించారు.
(The above story first appeared on LatestLY on May 28, 2024 08:43 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

