Vivekananda Reddy Murder Case: అనుచరులతో కలిసి భారీ కాన్వాయ్తో పులివెందుల నుంచి హైదరాబాద్ బయలుదేరిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి.. వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్రెడ్డిపై ఆరోపణలు.. నేటి మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్న విచారణ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసు విచారణ దూకుడుగా సాగుతున్నది. విచారణకు హాజరు కావాలంటూ సీబీఐ (CBI) నుంచి నోటీసులు (Notices) అందుకున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (YS Avinash Reddy) హైదరాబాద్ (Hyderabad) పయనమయ్యారు.
Hyderabad, April 17: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసు విచారణ దూకుడుగా సాగుతున్నది. విచారణకు హాజరు కావాలంటూ సీబీఐ (CBI) నుంచి నోటీసులు (Notices) అందుకున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (YS Avinash Reddy) హైదరాబాద్ (Hyderabad) పయనమయ్యారు. ఈ తెల్లవారుజామున అనుచరులతో కలిసి 10 వాహనాల్లో పులివెందుల నుంచి భారీ కాన్వాయ్తో హైదరాబాద్ బయలుదేరారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి గత రాత్రి సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్లోని సీబీఐ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆయన పులివెందుల నుంచి హైదరాబాద్ వస్తున్నారు.
చంచల్గూడ జైలుకు భాస్కర్రెడ్డి
అవినాష్ రెడ్డిని సీబీఐ ఇప్పటికే నాలుగుసార్లు విచారించింది. ఇది ఐదోసారి. ఇదే కేసులో నిన్న ఆయన తండ్రి భాస్కర్రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ ఆ వెంటనే అవినాష్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, భాస్కర్రెడ్డికి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయనను చంచల్గూడ జైలుకు తరలించారు.
(The above story first appeared on LatestLY on Apr 17, 2023 09:10 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

