PM Modi Bhimavaram Tour: రేపు భీమవరానికి ప్రధాని మోదీ, అల్లూరి సీతారామరాజు విగ్రహం ఆవిష్కరణ, భారీగా పోలీసు ఆంక్షలు
ప్రధాని నరేంద్ర మోదీ రేపు ఆంధ్రప్రదేశ్లోని భీమవరంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఏడాదిపాటు జరిగే వేడుకలను ఆయన ప్రారంభించనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ రేపు ఆంధ్రప్రదేశ్లోని భీమవరంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఏడాదిపాటు జరిగే వేడుకలను ఆయన ప్రారంభించనున్నారు. ప్రధాని కార్యాలయం (PMO) విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, సోమవారం భీమవరం పర్యటనతో పాటు, గుజరాత్లోని గాంధీనగర్లో 'డిజిటల్ ఇండియా వీక్ 2022'ను కూడా మోడీ ప్రారంభించనున్నారు.
జులై 4వ తేదీ రాత్రి 11.30 గంటలకు భీమవరంలో స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఏడాదిపాటు జరిగే ఉత్సవాలను ప్రధాని ప్రారంభిస్తారు. ఆపై గాంధీనగర్లో జరిగే 'డిజిటల్ ఇండియా వీక్ 2022'లో పాల్గొంటారని పీఎంవో ఒక ప్రకటనలో పేర్కొంది.
'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' కింద, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గుర్తించి, దేశవ్యాప్తంగా ప్రజలకు వారి గురించి అవగాహన కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటన పేర్కొంది. ఈ ప్రయత్నంలో భాగంగా, తెలుగు నాట ప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామ రాజు 125వ జయంతి సందర్భంగా ఏడాదిపాటు జరిగే వేడుకలను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఆయన 30 అడుగుల ఎత్తైన కాంస్య విగ్రహాన్ని కూడా ఆవిష్కరిస్తారు.
1897 జూలై 4న జన్మించిన సీతారామ రాజు తూర్పు కనుమల ప్రాంతంలోని గిరిజనుల ప్రయోజనాలను కాపాడేందుకు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చేసిన పోరాటాన్ని చేశారు. 1922లో ప్రారంభమైన గిరిజనుల గెరిల్లా తిరుగుబాటుకు ఆయన నాయకత్వం వహించారు. స్థానిక ప్రజలు సీతారామరాజును "మన్యం వీరుడు" అని పిలుస్తారు.
అనంతరం ప్రధాని మోదీ క్యాటలిస్ట్ ది టెక్నాలజీ డికేడ్ ఆఫ్ న్యూ ఇండియా అనే థీమ్తో గాంధీనగర్లో 'డిజిటల్ ఇండియా వీక్ 2022'ను ప్రధాని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా స్టార్టప్లను ప్రోత్సహించడం వంటి అనేక డిజిటల్ కార్యక్రమాలను మోదీ ప్రారంభించనున్నారు. భారతీయ భాషల్లో ఇంటర్నెట్, డిజిటల్ సేవలను సులభంగా యాక్సెస్ చేసేందుకు వీలు కల్పించే 'డిజిటల్ ఇండియా సంభాషిణి'ని కూడా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. టెక్నాలజీ ఆధారిత స్టార్టప్ల కోసం. ఈ పథకానికి 750 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని నిర్ణయించారు.
ప్రభుత్వ పథకాలను సులభతరం చేసేందుకు వేదికగా ఉండే 'మై స్కీమ్'ను ప్రధానమంత్రి పౌరులకు అంకితం చేస్తారు. దీంతో పాటు 'మేరీ పెహచాన్' సేవను కూడా సామాన్యులకు అంకితం చేయనున్నారు ప్రధాని మోదీ. చిప్స్ టు స్టార్టప్ (C2S) కార్యక్రమం కింద మద్దతు ఇచ్చే 30 సంస్థల మొదటి గ్రూప్ను కూడా మోడీ ప్రకటించనున్నారు. డిజిటల్ ఇండియా వీక్ 2022 కింద జూలై 4 నుండి జూలై 6 వరకు కార్యక్రమాలు నిర్వహించబడతాయి.
(The above story first appeared on LatestLY on Jul 03, 2022 09:59 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

