Andhra Pradesh: తూర్పు గోదావరిలో తీవ్ర విషాదం, గోదావరి నదిలో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి, మరొకరు మిస్సింగ్, గాలింపు చర్యలు చేపట్టిన పోలీస్ అధికారులు

తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం ఎల్‌.గన్నవరంలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం దగ్గర్లోని గోదావరిలో స్నానానికి వెళ్లిన పదో తరగతి విద్యార్థులు బండారు నవీన్‌కుమార్‌ (15), యర్రంశెట్టి రత్నసాగర్‌ (15), పంతాల పవన్‌ (15), ఖండవిల్లి వినయ్‌ (15) గల్లంతయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకుని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు గాలింపు చర్యలు పర్యవేక్షిస్తున్నారు.

Andhra Pradesh: తూర్పు గోదావరిలో తీవ్ర విషాదం, గోదావరి నదిలో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి, మరొకరు మిస్సింగ్, గాలింపు చర్యలు చేపట్టిన పోలీస్ అధికారులు
Three members of a family Committed Suicide Attempt In Godavari River in Andhra pradesh (Photo-ANI)

Amaravati, June 28: తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం ఎల్‌.గన్నవరంలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం దగ్గర్లోని గోదావరిలో స్నానానికి వెళ్లిన పదో తరగతి విద్యార్థులు బండారు నవీన్‌కుమార్‌ (15), యర్రంశెట్టి రత్నసాగర్‌ (15), పంతాల పవన్‌ (15), ఖండవిల్లి వినయ్‌ (15) గల్లంతయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకుని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు గాలింపు చర్యలు పర్యవేక్షిస్తున్నారు. గాలింపు చర్యల్లో భాగంగా సోమవారం ఉదయం ముగ్గురు విద్యార్థుల మృతదేహాలు (Three students drown in Godavari river) లభ్యం అయ్యాయి.

మరొకరి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. లభ్యమైన మృతదేహాల్లో బండారు నవీన్, రత్నసాగర్, పంతాల పవన్‌ ఉ‍న్నట్లు పోలీసులు గుర్తించారు. వీరు లంకల గన్నవరానికి చెందిన పదో విద్యార్ధులుగా పోలీసులు గుర్తించారు. ఆదివారం మధ్యాహ్నం ఇంటి వద్ద భోజనాలు చేసి ఆ నలుగురు విద్యార్థులు గోదావరి తీరానికి (Godavari river) ఆడుకొనేందుకు వెళ్లారు. రాత్రి ఏడు గంటలవుతున్నా తిరిగి రాలేదు. దీంతో కంగారు పడిన కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఏపీలో కొత్తగా 4,250 కరోనా కేసులు నమోదు, బోధనాసుపత్రుల్లో కోవిడ్, నాన్‌కోవిడ్‌ సేవలు అందించాలని ఆదేశాలు జారీ చేసిన వైద్య విద్యా డైరెక్టర్‌, ఏలూరు ఆస్పత్రిలో రోగి మృతిపై విచారణకు ఆదేశించిన మంత్రి ఆళ్ల నాని

గోదావరి తీరాన ఒక విద్యార్థి సైకిల్‌ ఉండటంతో అనుమానంతో ఇసుక తిన్నెల్లో గాలించారు. అక్కడ నలుగురు విద్యార్థుల దుస్తులు, మాస్కులు, రెండు సెల్‌ఫోన్లు లభ్యమయ్యాయి. దీంతో ఆ నలుగురు విద్యార్థులూ గోదావరిలో స్నానానికి దిగి, గల్లంతైనట్టు స్థానికులు అనుమానిస్తున్నారు.

(The above story first appeared on LatestLY on Jun 28, 2021 10:38 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).