Tirumala Income: ఈ ఏడాది తిరుమల శ్రీవారి ఆదాయం రూ.1,320 కోట్లు.. ఈ ఏడాది స్వామివారిని దర్శించుకున్నవారి సంఖ్య 2.35 కోట్లు
ఈ ఏడాది తిరుమల వెంకన్నకు కేవలం హుండీ కానుకల రూపేణా రూ.1,320 కోట్లు లభించింది. ఈ మేరకు టీటీడీ శ్వేతపత్రంలో పేర్కొన్నారు.
Tirumala, Dec 31: కరోనా (Corona) ప్రభావం వల్ల 2020, 2021లో తిరుమల (Tirumala) క్షేత్రంలో తీవ్ర ఆంక్షల వల్ల భక్తులు పెద్దగా రాలేకపోయారు. 2022లో ఆ పరిస్థితి లేదు. ఆంక్షల ఎత్తివేతతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. స్వామి వారి హుండీ కూడా అదే స్థాయిలో కళకళలాడింది. ఈ ఏడాది తిరుమల వెంకన్నకు కేవలం హుండీ కానుకల రూపేణా రూ.1,320 కోట్లు లభించింది. ఈ మేరకు టీటీడీ (TTD) శ్వేతపత్రంలో పేర్కొన్నారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్వామివారి ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేశారు.
ప్రపంచ బ్లిట్జ్ మహిళల చెస్ చాంపియన్షిప్లో కోనేరు హంపి రికార్డ్.. రజత పతకం కైవసం
ఈ సంవత్సరం ఇప్పటిదాకా స్వామివారిని 2.35 కోట్ల మంది దర్శనం చేసుకున్నారని... 1.08 కోట్ల మంది భక్తుల తలనీలాల మొక్కులు సమర్పించుకున్నారని... 11.42 కోట్ల లడ్డూల విక్రయాలు జరిగాయని టీటీడీ వివరించింది.
వరుసగా పదో నెల 100 కోట్ల మార్క్ దాటిన శ్రీవారి హుండీ ఆదాయం
Watch Video >>>https://t.co/LIBYwX9DxQ#TTD #Tirumala #CMJagan #NTVTelugu #NTVNews
— NTV Telugu (@NtvTeluguLive) December 31, 2022
(The above story first appeared on LatestLY on Dec 31, 2022 09:49 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

