YSRCP Central Office Demolished: తాడేపల్లిలో వైసీపీ కార్యాలయం కూల్చివేత.. ప్రొక్లైన్లు, బుల్డోజర్లతో భవనాన్ని కూల్చివేస్తున్న సీఆర్డీఏ అధికారులు
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో నిర్మాణంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని అధికారులు కూల్చివేశారు. తాడేపల్లిలో శనివారం ఉదయం 5:30 గంటల సమయంలో కూల్చివేతలు ప్రారంభించారు.
Vijayawada, June 22: గుంటూరు (Guntur) జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో నిర్మాణంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని (YSRCP Central Office) అధికారులు కూల్చివేశారు (Demolished). తాడేపల్లిలో శనివారం ఉదయం 5:30 గంటల సమయంలో కూల్చివేతలు ప్రారంభించారు. ప్రొక్లైన్లు, బుల్డోజర్లతో భవనం కూల్చివేశారు. శ్లాబ్ వేయడానికి సిద్ధంగా ఉన్న భవనాన్ని కోల్చివేశారు. బోట్ యార్డుగా ఉపయోగిస్తున్న స్థలాన్ని తక్కువ లీజుతో వైసీపీ కార్యాలయం కోసం అప్పటి జగన్ సర్కార్ కట్టబెట్టిందంటూ సీఆర్డీఏ అధికారులు ఆరోపించారు. ఈ అక్రమ నిర్మాణంపై వైసీపీకి సీఆర్డీఏ నోటీసులు జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టును శుక్రవారం వైసీపీ ఆశ్రయించింది.
తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేస్తున్న CRDA అధికారులు
ఉదయం 5.30 గంటల నుంచి భారీ పోలీస్ బందోబస్తు మధ్య బుల్డోజర్లు, పొక్లెయినర్లతో కూల్చివేత పనులు మొదలుపెట్టారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లిలోని 2 ఎకరాల్లో పార్టీ కార్యాలయం నిర్మాణం… pic.twitter.com/pN9Sv7J9fA
— Telugu Scribe (@TeluguScribe) June 22, 2024
మళ్లీ కోర్టుకు వెళ్తామన్న వైసీపీ
విచారణ జరిపిన న్యాయస్థానం చట్టాన్ని మీరి వ్యవహరించవద్దని ఇరువురికీ సూచించింది. ఈ క్రమంలోనే శనివారం ఉదయం అధికారులు కూల్చివేతలు చేపట్టారు. అయితే, హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ కార్యాలయ భవనాన్ని కూల్చివేశారంటూ వైసీపీ నేతలు నిరసనలకు దిగారు. కూటమి ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడిందని.. ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్తామన్నారు.
(The above story first appeared on LatestLY on Jun 22, 2024 09:14 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

