Accident In Tirumala: కొండపైకి కాలినడకన వెళ్తున్న భక్తులపైకి దూసుకెళ్లిన అంబులెన్స్.. ఇద్దరు మృతి.. తిరుమలలో ఘటన
తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి మండలం నరశింగాపురం వద్ద తిరుమల కొండ మీదకు కాలినడకన వెళ్తున్న భక్తులపైకి ఓ 108 అంబులెన్స్ దూసుకెళ్లింది.
Tirumala, Jan 6: తిరుపతి (Tirupati) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి మండలం నరశింగాపురం వద్ద తిరుమల (Tirumala) కొండ మీదకు కాలినడకన వెళ్తున్న భక్తులపైకి ఓ 108 అంబులెన్స్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందగా.. మరో ముగ్గరికి గాయాలయ్యాయి. మదనపల్లి నుంచి తిరుపతి రూయా ఆస్పత్రికి అంబులెన్స్ లో ఓ రోగిని తీసుకొస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను స్థానిక దవాఖానలో చేర్పించి వైద్యం చేయిస్తున్నారు.
భక్తులపైకి దూసుకెళ్లిన అంబులెన్స్.. ఇద్దరు మృతి
తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి మండలం నరశింగాపురం వద్ద భక్తులపైకి అంబులెన్స్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో ముగ్గరికి గాయాలయ్యాయి.మదనపల్లి నుంచి తిరుపతి రూయా ఆస్పత్రికి అంబులెన్స్లో రోగిని… pic.twitter.com/fDlhZdIqvo
— ChotaNews App (@ChotaNewsApp) January 6, 2025
మృతులు వీళ్లే
మృతులను అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం చెంపాలపల్లికి చెందిన రెడ్డమ్మ, లక్ష్మమ్మగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
(The above story first appeared on LatestLY on Jan 06, 2025 08:24 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

