Raids On Chutneys: వామ్మో! కుళ్లిపోయిన కూరగాయలతో ఆహార పదార్థాలు.. చట్నీస్ రెస్టారెంట్ పై కేసు నమోదు
హైదరాబాద్ లో బయట భోజనం చేయాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. రోజురోజుకు ఆహార కల్తీ అధికమవ్వడమే దీనికి కారణం. కుల్లిన కూరగాయలు, మాంసం, నాసిరకమైన పదార్థాలతో ఆహారాన్ని తయారుచేస్తూ కొందరు కక్కుర్తికి పాల్పడుతున్నారు.
Hyderabad, Oct 19: హైదరాబాద్ (Hyderabad) లో బయట భోజనం చేయాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. రోజురోజుకు ఆహార కల్తీ అధికమవ్వడమే దీనికి కారణం. కుల్లిన కూరగాయలు, మాంసం, నాసిరకమైన పదార్థాలతో ఆహారాన్ని తయారుచేస్తూ కొందరు కక్కుర్తికి పాల్పడుతున్నారు. చిన్న హోటల్స్ నుంచి పేరుమోసిన రెస్టారెంట్ల వరకూ ఇదే పరిస్థితి. తాజాగా కొండాపూర్ శరత్ సిటీ మాల్ లోని చట్నీస్ (Chutneys) రెస్టారెంట్ లో టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా వారి తనిఖీల్లో భయంకరమైన నిజాలు వెలుగుచూశాయి.
Here's Video:
చట్నీస్ రెస్టారెంట్ లోకి ఫుడ్ సేఫ్టీ అధికారులు వెళ్లారు.
నేరుగా కిచెన్ లోకి ప్రవేశించగానే వాళ్లకు గోధుమ పిండి, ఉప్మా రవ్వ కనిపించాయి. వాటినిండా నల్లటి పురుగులు.
మరోవైపు చూస్తే, పెద్ద డ్రమ్ అందులో బొద్దింకలు ప్రత్యక్షమయ్యాయి.
ఎక్కడైతే సరుకులు భద్రపరిచాలో అక్కడంతా బొద్దింకలే… pic.twitter.com/t66fcseVWd
— Aadhan Telugu (@AadhanTelugu) October 19, 2024
తనిఖీల్లో బయటపడ్డ నిజాలు
తనిఖీలు చేపట్టిన అధికారులకు కందిపప్పు డ్రమ్ములో బొద్దింకలు ప్రత్యక్షమై షాక్ ఇచ్చాయి. గోధుమ పిండి, రవ్వకు పురుగులు పట్టి నల్లగా మారి మరో షాక్ ఇచ్చాయి. ఉల్లిగడ్డలు, క్యాబేజీలు పూర్తిగా కుల్లిపోయి కనిపించాయి. అపరిశుభ్రమైన వాతావరణంలో కుళ్లిపోయిన కూరగాయలతో ఆహార పదార్థాలను తయారుచేస్తున్నట్లు అధికారులుగుర్తించారు. దీంతో రెస్టారెంట్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదుచేశారు.
(The above story first appeared on LatestLY on Oct 19, 2024 11:09 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

