Vande Bharat Passengers Can Buy Food Onboard: వందేభారత్ ప్రయాణికులకు కొత్త సదుపాయం.. ఫుడ్ ఆప్షన్ ఎంచుకోకపోయినా రైలు లోపల హాట్ హాట్ గా సర్వింగ్.. వివరాలు ఇవిగో!

వందే భారత్ రైళ్లలో ప్రయాణించే వారికి శుభవార్త. వందే భారత్ ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది.

Vande Bharat Passengers Can Buy Food Onboard: వందేభారత్ ప్రయాణికులకు కొత్త సదుపాయం.. ఫుడ్ ఆప్షన్ ఎంచుకోకపోయినా రైలు లోపల హాట్ హాట్ గా సర్వింగ్..  వివరాలు ఇవిగో!
Vande Bharat (Photo Credits: File Image)

Hyderabad, Feb 8: వందే భారత్ రైళ్లలో (Vande Bharat) ప్రయాణించే వారికి శుభవార్త. వందే భారత్ ప్రయాణికుల (Passengers) కోసం భారతీయ రైల్వే కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఇక నుంచి వందే భారత్ లో ప్రయాణించే ఏ ప్రయాణికుడైనా టికెట్ బుకింగ్‌ చేసుకునే సమయంలో ఫుడ్ ఆప్షన్ ఎంచుకోకపోయినా, ప్రయాణం చేసే సమయంలో వాటిని కొనుగోలు చేసేలా అవకాశం కల్పించింది. అహారం అందుబాటులో ఉన్నదాన్ని బట్టి సిబ్బంది అహారం అందిస్తారని రైల్వే బోర్డు వెల్లడించింది. ఈ మేరకు ఐఆర్సీటీసీకి రైల్వే బోర్డు లేఖ రాసింది.

ఢిల్లీలో కమల వికాసం.. మ్యాజిక్ ఫిగర్ దాటేసిన బీజేపీ.. నిజమైన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు.. ఎన్నికల ఫలితాల అప్‌ డేట్స్.. (లైవ్)

ఢిల్లీని ఏలే రాజు ఎవ్వరు? ఆమ్ ఆద్మీ పార్టీనా? బీజేపీనా? లేక హస్తమా?? క్షణ క్షణం ఉత్కంఠ రేపుతోన్న ఢిల్లీ ఎన్నికల ఫలితాల లైవ్ అప్‌ డేట్స్.. (లైవ్)

ఎందుకు ఇలా??

వందే భారత్ ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే సమయంలో మీల్స్ అనే ఆప్షన్ చూపిస్తుంది. కొందరు వేరే ఆహారాన్ని చూసుకోవచ్చనే ఉద్దేశంతో ఫుడ్ ఆప్షన్‌ ను స్కిప్ చేస్తుంటారు. అయితే, ఒక్కోసారి ఇలా చేసుకోవడం వల్ల రైళ్లలో డబ్బులు ఇచ్చి కొందామన్నా కూడా ఆహారం ఇచ్చేందుకు సిబ్బంది నిరాకరిస్తున్నారు. దీనిపై ప్రయాణికుల నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో తాజాగా రైల్వే బోర్డు ఈ సదుపాయాన్ని కల్పించింది.

(The above story first appeared on LatestLY on Feb 08, 2025 10:17 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).