Kondagattu Development: ఎల్లుండి కొండగట్టుకు కేసీఆర్.. మాస్టర్ ప్లాన్ పై అధికారులతో చర్చ.. నేడు కొండగట్టుకు ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆనంద్సాయి
కొండగట్టు ఆలయ అభివృద్దికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నడుంకట్టారు. ఇందులో భాగంగా ఈ నెల 14న కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని ఆయన సందర్శించనున్నారు.
Hyderabad, Feb 12: కొండగట్టు (Kondagattu) ఆలయ అభివృద్దికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) నడుంకట్టారు. ఇందులో భాగంగా ఈ నెల 14న కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని ఆయన సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు (Development Works), మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై అధికారులతో చర్చలు జరుపుతారు.
కాగా, కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆనంద్సాయి నేడు కొండగట్టు వెళ్లనున్నారు. ఆలయ పరిశీలన అనంతరం ఆలయ పునర్నిర్మాణ ప్రణాళికలను రూపొందిస్తారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో కొండగట్టు ఆలయ అభివృద్ధికి రూ. 100 కోట్లు ప్రకటించి నిధులు కేటాయించింది.
14న కొండగట్టుకు సీఎం కేసీఆర్.. రాష్ట్రంలో రెండో అతిపెద్ద పుణ్యక్షేత్రంగా మార్చేందుకు నడుం కట్టిన ముఖ్యమంత్రి..#KCR #Kondagattu #hanumantemple #Telangana #Jagtial@BRSparty https://t.co/fNM5Lqn6BK
— Samayam Telugu (@SamayamTelugu) February 11, 2023
KCR to Visit Kondagattu on February 14https://t.co/iR0MYlNHd6
— Sakshi Post (@SakshiPost) February 11, 2023
(The above story first appeared on LatestLY on Feb 12, 2023 09:07 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

