Kumbh Mela 2025: కుంభమేళా వెళ్లే ప్రయాణికులకు షాక్ ఇచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్.. రోడ్డుపై పడిగాపులుపడ్డ భక్తులు.. హైదరాబాద్ లో ఘటన.. అసలేం జరిగింది? (వీడియో)
యూపీలో జరుగుతున్న మహా కుంభమేళాకు వెళ్లే భక్తుల సంఖ్య కోట్లలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి కూడా కుంభమేళాకు వెళ్లేవారు చాలామంది ఉంటారు.
Hyderabad, Feb 2: యూపీ (UP) ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు (Kumbh Mela 2025) వెళ్లే భక్తుల సంఖ్య కోట్లలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి కూడా కుంభమేళాకు వెళ్లేవారు చాలామంది ఉంటారు. అయితే, కుంభమేళా వెళ్లే భక్తులకు ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ షాక్ ఇచ్చాడు. హైదరాబాద్ లోని మెహిదీపట్నంలో భక్తులను బస్సులో ఎక్కించుకున్న డ్రైవర్.. మేడ్చల్ వరకు రాగానే.. బస్సు చెడిపోయిందని అందర్నీ దించేశాడు. ఆ తర్వాత బస్సును అక్కడే నిలిపేసి పలాయనంచిత్తగించాడు. దీంతో ఎటూ వెళ్ళలేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
హైదరాబాద్ పాతబస్తీలో అగ్నిప్రమాదం.. సమయానికి స్పందించడంతో తప్పిన ముప్పు (వీడియో)
Here's Video:
కుంభమేళా వెళ్లే ప్రయాణికులకు షాక్ ఇచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్
రోడ్డు మీద వదిలేసి వెళ్లిపోయిన డ్రైవర్
మెహిదీపట్నంలో బస్సు ఎక్కించుకుని మేడ్చల్ లో బస్సు చెడిపోయిందని ఆపేసి పారిపోయిన బస్ డ్రైవర్ pic.twitter.com/lsJtzfBUpP
— BIG TV Breaking News (@bigtvtelugu) February 2, 2025
తప్పిపోయిన వారు దొరికారు
మహాకుంభమేళాలో పాల్గొనేందుకు వెళ్లిన నలుగురు జగిత్యాల మహిళలు బుచ్చవ్వ, సత్తవ్వ, రాజవ్వ, నరసవ్వ ఇటీవల తప్పిపోయారు. అయితే, జిల్లా ఎస్పీ ప్రయాగ్ రాజ్ పోలీసులను సంప్రదించి మహిళల ఆచూకీ ఎట్టకేలకు కనుక్కున్నారు. దీంతో కథ సుఖాంతమైంది.
(The above story first appeared on LatestLY on Feb 02, 2025 07:33 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

