Hyderabad Shocker: విద్యార్థులు కాదు కామాంధులు, తోటి విద్యార్థినిపై 5మంది దారుణంగా అత్యాచారం, ఘటన వీడియో తీసి మళ్లీ మళ్లీ అత్యాచారం, నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

హయత్‌నగర్‌ తట్టిఅన్నారంలో దారుణ ఘటన జరిగింది. పదవ తరగతి విద్యార్థినిపై ఐదుగురు తోటి విద్యార్థులు అత్యాచారం (5 classmates gang-rape class 10 girl) చేశారు. అత్యాచారం సమయంలో నిందితులు వీడియోను (record video to blackmail) తీశారు.

Hyderabad Shocker: విద్యార్థులు కాదు కామాంధులు, తోటి విద్యార్థినిపై 5మంది దారుణంగా అత్యాచారం, ఘటన వీడియో తీసి మళ్లీ మళ్లీ అత్యాచారం, నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Man thrashes wife for failing to conceive a child (Representational: Getty)

Hyd, Nov 29: హయత్‌నగర్‌ తట్టిఅన్నారంలో దారుణ ఘటన జరిగింది. పదవ తరగతి విద్యార్థినిపై ఐదుగురు తోటి విద్యార్థులు అత్యాచారం (5 classmates gang-rape class 10 girl) చేశారు. అత్యాచారం సమయంలో నిందితులు వీడియోను (record video to blackmail) తీశారు. ఈ విషయంపై ఎవరికైనా చెబితే వీడియోను సోషల్‌ మీడియాలో పెడతామంటూ బెందిరించారు.వీడియో చూపించి పదిరోజుల తర్వాత మరోసారి ఐదుగురు నిందితులు అత్యాచారం చేశారు.

సమాజం సిగ్గుపడే ఘటన, ప్రతీ రాత్రి కన్న కూతుర్లపై కన్నతండ్రితో సహా చిన్నాన్న కూడా అత్యాచారం, తట్టుకోలేక ఇంటి నుంచి పారిపోయిన అక్కా చెల్లెళ్లు

అత్యాచారం వీడియోను నిందితులు తోటి విద్యార్థులకు పంపారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులపై పోలీసులు అత్యాచారం, పోక్సో కేసులు నమోదు చేశారు. పదవ తరగతి విద్యార్థినిపై జరిగిన అత్యాచారం కేసులో పోలీసులు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. యువకులంతా ఒకే కాలనీకి చెందిన వారిగా గుర్తించారు. వీరంతా ఒకే తరగతి కావడంతో విద్యార్థిని యువకులతో సన్నిహితంగా ఉంది.

షాకింగ్ వీడియో, భర్తను దారుణంగా చంపి ఆ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికేసిన భార్య, నరికిన ముక్కలను బయట పారవేసేందుకు తీసుకువెళుతున్న సీసీటీవీ పుటేజి బయటకు..

ఇదే అదునుగా భావించి నిందితులు బాలికపై అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. విద్యార్థినిపై నాలుగు నెలలుగా పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులంతా మైనర్లుగా పోలీసులు గుర్తించారు. సెల్‌ ఫోన్లలో వీడియో ఆధారంగా ఈ ఘటనకు పాల్పడిన వారిని పోలీసులు గుర్తించారు. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులంతా మైనర్లు కావడంతో వారిని జువైనల్‌ హోమ్‌కి తరలించే అవకాశముంది.

(The above story first appeared on LatestLY on Nov 29, 2022 05:50 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).