Mobile Camera In Washrooms: మహబూబ్ నగర్ పాలిటెక్నిక్ కాలేజీలో దారుణం.. అమ్మాయిల వాష్ రూంలో వీడియో రికార్డింగ్.. ఈ పని చేసింది ఎవరంటే??
హైదరాబాద్ సీఎంఆర్ కాలేజీ బాత్రూంలో సీక్రెట్ వీడియో రికార్డింగ్ వివాదం కొనసాగుతున్న వేళ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ గర్ల్స్ కాలేజీలో మరో సీక్రెట్ కెమెరా కలకలం సృష్టించింది.
Mahabubnagar, Jan 5: హైదరాబాద్ సీఎంఆర్ కాలేజీ (CMR College) బాత్రూంలో (Washrooms) సీక్రెట్ వీడియో రికార్డింగ్ వివాదం కొనసాగుతున్న వేళ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ గర్ల్స్ కాలేజీలో మరో సీక్రెట్ కెమెరా కలకలం సృష్టించింది. అమ్మాయిల టాయిలెట్స్ లో శనివారం మొబైల్ తో వీడియోలు రికార్డు చేస్తున్నట్లు గుర్తించిన విద్యార్థినులు కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ విషయంపై కాలేజీ ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. బాధ్యులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు నిరసనకు దిగాయి.
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల గర్ల్స్ టాయిలెట్స్లో కెమెరా కలకలం
మహబూబ్ నగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల గర్ల్స్ టాయిలెట్స్లో.. మొబైల్లో కెమెరా ఆన్లో ఉంచి వీడియో రికార్డింగ్
కళాశాలలో ఆందోళనకు దిగిన విద్యార్థి సంఘాలు
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు
— Telugu Scribe (@TeluguScribe) January 4, 2025
అదే కాలేజీ స్టూడెంట్ పనే
కాలేజీ ఎదుట విద్యార్థినులు ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి వచ్చి దర్యాప్తు చేపట్టారు. విచారణ జరిపిన పోలీసులు నిందితుడిని అదే కాలేజీలోని థర్డ్ ఇయర్ స్టూడెంట్ సిద్ధార్థ్ గా గుర్తించారు. బ్యాక్ లాగ్ పరీక్ష రాసేందుకు వచ్చిన సమయంలో వాష్ రూంలో మొబైల్ కెమెరా పెట్టినట్లుగా నిందితుడు ఒప్పుకున్నాడని తెలిపారు.
(The above story first appeared on LatestLY on Jan 05, 2025 06:46 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

