Rain Alert: తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షసూచన, బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు పడే ప్రభావం..
రాగల మూడ్రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు.
హైదరాబాద్ : మండుటెండలతో , తీవ్ర ఉక్కపోతతో అల్లాడిపోతున్న తెలంగాణ వాసులకు వాతావరణ కేంద్రం చల్లటి కబురు చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో రాగల మూడ్రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు.
మధ్య చత్తీస్ఘడ్ నుండి తెలంగాణ, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదగా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కి మీ ఎత్తు వద్ద కొనసాగుతోంది. దీని ప్రభావంతోనే అక్కడ వర్షాలు కురవనున్నాయి. వర్షం పడే సమయంలో గాలి వేగం గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీస్తుందని అధికారులు తెలిపారు.
(The above story first appeared on LatestLY on Apr 17, 2022 10:38 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

