MLC Kavitha: కవిత పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. కేవియెట్ దాఖలు చేసిన ఈడీ.. నేడు ఇరువర్గాల వాదనలు విననున్న సుప్రీం ధర్మాసనం

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తనపై ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ నేడు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఇప్పటికే కవిత పిటిషన్ పై ఈడీ కేవియెట్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో, ఇరువురి వాదనలు విన్న తర్వాత సుప్రీం ధర్మాసనం ఉత్తర్వులు ఇవ్వనుంది.

MLC Kavitha: కవిత పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. కేవియెట్ దాఖలు చేసిన ఈడీ.. నేడు ఇరువర్గాల వాదనలు విననున్న సుప్రీం ధర్మాసనం
Kalvakuntla Kavitha | File Image

Newdelhi, March 27: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో (Delhi Liquor Scam Case) తనపై ఈడీ (ED) విచారణను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) దాఖలు చేసిన పిటిషన్ నేడు సుప్రీంకోర్టులో (Supreme Court) విచారణకు రానుంది. ఇప్పటికే కవిత పిటిషన్ పై ఈడీ కేవియెట్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో, ఇరువురి వాదనలు విన్న తర్వాత సుప్రీం ధర్మాసనం ఉత్తర్వులు ఇవ్వనుంది. కవిత పిటిషన్ నెంబర్ 36 గా లిస్ట్ అయ్యింది. జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం కవిత పిటిషన్ పై విచారణ చేపట్టనుంది. తనకు ఈడీ సమన్లు ఇవ్వడాన్ని ఆమె సవాల్ చేశారు. ఈడీ సమన్లు రద్దు చేయాలని, మహిళలను ఇంటి వద్దే విచారణ చేయాలని, తనకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కవిత కోరారు. ఈడీ విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలన్నది కవిత విజ్ఞప్తి. ఈడీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని పిటిషన్‌లో కవిత పేర్కొన్నారు. మరి దీనిపై సుప్రీం ఎలా స్పందిస్తుంది? విచారణపై స్టే విధిస్తుందా? లేక దర్యాప్తులో జోక్యం చేసుకోవడానికి నో చెబుతుందా ? లేక మహిళ అన్న కోణంలో ఏమైనా వెసులుబాట్లు కల్పిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇవాళ సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ తో పాటు పలు కీలక కేసుల విచారణ చేపట్టనున్నారు. వివేకా హత్య కేసు, కృష్ణా నదీ నీటి వివాదం, ఒడిశా-ఏపీ పోలవరం కేసులను సుప్రీంకోర్టు నేడు విచారించనుంది.

Game Changer: 'గేమ్ చేంజర్'గా రానున్న రామ్ చరణ్.. శంకర్-చరణ్ కొత్త సినిమా టైటిల్ ఇదే.. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ ప్రకటించిన చిత్రబృందం

ఇప్పటివరకూ ఏం జరిగిందంటే??

ఈనెల 14న సుప్రీంకోర్టులో కవిత పిటిషన్‌ వేయగా.. 15న ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందుకు వచ్చింది. త్వరగా విచారణ చేపట్టాలని కవిత తరఫు న్యాయవాదులు కోరగా.. ఈ నె ల27 జాబితాలో ఉందని కోర్టు స్పష్టం చేసింది. కాగా, కవితను ఈడీ అధికారులు ఇప్పటి వరకు మూడుసార్లు విచారించారు. మూడు రోజులు మొత్తం 27 గంటలకు పైగా సుదీర్ఘ విచారణ సాగింది. మూడోరోజు విచారణ పూర్తయిన తర్వాత మళ్లీ విచారణ ఉంటే మెయిల్ ద్వారా సమాచారం అందిస్తామని కవితతో పాటు ఆమె న్యాయవాది సోమా భరత్‌కు ఈడీ వివరించింది.

Rains Alert In Telugu States: రానున్న మూడు రోజుల్లో వర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ.. రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

(The above story first appeared on LatestLY on Mar 27, 2023 09:16 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).