IVF Centre in Gandhi Hospital: సంతానం లేని దంపతులకు కేసీఆర్ సర్కారు గుడ్ న్యూస్.. ప్రజల కోసం రాష్ట్రంలో తొలిసారిగా గాంధీ ఆస్పత్రిలో ఐవీఎఫ్ సెంటర్
సంతానం లేని దంపతులకు తెలంగాణ సర్కారు శుభవార్త చెప్పింది. ప్రజల కోసం రాష్ట్రంలో తొలిసారిగా ఇన్-విట్రో-ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) సెంటర్ ను అందుబాటులోకి తెస్తున్నది.
Hyderabad, Oct 8: సంతానం లేని దంపతులకు తెలంగాణ సర్కారు (Telangana Government) శుభవార్త చెప్పింది. ప్రజల కోసం రాష్ట్రంలో తొలిసారిగా ఇన్-విట్రో-ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్-IVF) సెంటర్ ను అందుబాటులోకి తెస్తున్నది. రూ.5 కోట్లతో గాంధీ దవాఖానలో (Gandhi Hospital) సంతాన సాఫల్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మాతా, శిశు ఆరోగ్య కేంద్రం భవనంలోని ఐదో అంతస్థులో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని ఆదివారం మంత్రులు హరీశ్రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభిస్తారని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ఎం రాజారావు తెలిపారు.
Today is a historic milestone as Telangana government sets up the first government IVF (In vitro fertility) center at Gandhi hospital.
Thanks to Hon’ble #CMKCR garu’s visionary leadership, expensive IVF treatments are now free making services accessible and affordable to… pic.twitter.com/HR0oVsvso5
— Harish Rao Thanneeru (@BRSHarish) October 8, 2023
అలా ఇప్పటివరకు 200 మహిళలకు సంతానం
2018 నుంచి గాంధీ దవాఖానలో ఐయూఐ విధానం ద్వారా సంతాన సాఫల్య కేంద్రం నిర్వహిస్తున్నామని, మందులు వాడటంతో ఇప్పటివరకు 200 మహిళలకు సంతానం కలిగిందని చెప్పారు. ఇప్పుడు మంత్రి హరీశ్రావు ప్రత్యేక చొరవతో ఐవీఎఫ్ విధానాన్ని అందుబాటులోకి తేవడం శుభపరిణామమని సంతాన సాఫల్య కేంద్రం నోడల్ అధికారి, గైనకాలజీ విభాగం ప్రొఫెసర్ వెల్లంకి జానకీ తెలిపారు.
(The above story first appeared on LatestLY on Oct 08, 2023 09:17 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

