Telangana's COVID Report: తెలంగాణలో కొత్తగా మరో 2,256 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 77 వేలు దాటిన కొవిడ్ బాధితుల సంఖ్య, 614కు పెరిగిన కరోనా మరణాలు
Coronavirus in India (Photo Credits: IANS)

Hyderabad, August 8:  తెలంగాణ ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్‌ ప్రకారం గత 24 గంటల్లో 23,322 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో  2,256 మందికి పాజిటివ్ అని తేలింది, అయితే ఇంకా 1596 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 5,90,306 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 77,513కి చేరుకుంది.

నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 464 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా,  రంగారెడ్డి జిల్లా నుంచి 181,  మేడ్చల్ నుంచి 138 , మరియు సంగారెడ్డి జిల్లాల నుంచి 92 పాజిటివ్ కేసుల చొప్పున నిర్ధారించబడ్డాయి. అలాగే మరికొన్ని జిల్లాల్లో కరోనావైరస్ విజృంభిస్తుంది. నిన్న  వరంగల్ అర్బన్ జిల్లా నుంచి 187  పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరీంనగర్  జిల్లా నుంచి 101 కేసులు వచ్చాయి.

Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

ఆగష్టు 7న రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 32 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

మరోవైపు గత 24 గంటల్లో మరో 14కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 615 కు పెరిగింది.

అలాగే, శుక్రవారం సాయంత్రం వరకు మరో 1091 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 54,330 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 22,568 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.