Telangana Shocker: ప్రేమ విఫలం కావడంతో కొడుకు ఆత్మహత్య, నీవు లేని చోట ఉండలేనంటూ మూడు రోజులకే తల్లి కూడా చెరువులో దూకి ఆత్మహత్య, మెదక్ జిల్లాలో విషాద ఘటన
representational image (photo-Getty)

Medak, July 29: తెలంగాణలో మెదక్జిల్లాలోని రామాయంపేటలో (Ramayampet) విషాదకర చోటు చేసుకుంది. కొడుకు మృతి తట్టుకోలేక ఓ తల్లి బలవన్మరణానికి పాల్పడింది. రామాయంపేటకు చెందిన వరలక్ష్మి, శివకుమార్‌ తల్లీ కొడుకులు. ప్రేమ విఫలమవడంతో శివకుమార్‌ మూడు రోజుల క్రితం చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

హైదరాబాద్ ఐటీఐఆర్‌ ప్రాజెక్టు రద్దుపై మండిపడిన మంత్రి కేటీఆర్, మోదీ ప్రభుత్వం తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని వెల్లడి

కొడుకు మృతితో వరలక్ష్మి తీవ్రమనస్థాపానికి గురైంది. అయితే శివకుమార్‌ మృతిని తట్టుకోలేక శుక్రవారం ఉదయం చెరువులో దూకి ప్రాణాలు(Woman ends life) తీసుకున్నది. సమాచారం అందుకున్న రామాయపట్నం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చెరువులోనుంచి ఆమె మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.