Time Square: న్యూయార్క్ సిటీలోని టైమ్స్ స్క్వేర్ బిల్ బోర్డుపై సీఎం రేవంత్ ఫొటో సందడి.. వీడియో మీరూ చూడండి..!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కుంగుబాటుకు గురైన మేడిగడ్డ బ్యారేజీ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన ఈ బ్యారేజీ కుంగుబాటుకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని, దీనిపై సమగ్ర విచారణ జరపాలంటూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ పై భూపాలపల్లి జిల్లా కోర్టు స్పందించింది.
Newyork, Aug 6: అమెరికాలో (America) న్యూయార్క్ (Newyork) నగరంలో ఉన్న టైమ్స్ స్క్వేర్ (Time Square) బిల్డింగ్ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ప్రాంతమన్న విషయం తెలిసిందే. వాణిజ్య ప్రాంతంగానే కాకుండా ఒక టూరిస్ట్ డెస్టినేషన్ గా, వినోద కేంద్రంగా కూడా ఈ స్పాట్ అందరి మన్ననలను అందుకొంటుంది. ఇక్కడి బిల్లుబోర్డుల్లో నిత్యం వాణిజ్య ప్రకటనలు కనిపిస్తాయి. తమ ప్రకటనలు కూడా అక్కడ వేసుకుంటూ ఔత్సాహికులు ఆనందపడుతుంటారు. ఈ వీధి అంతా కోలాహలంగా, సందడిగా ఉంటుంది. వీడియో కాల్స్, సెల్ఫీలు తీసుకుంటూ జనాలు ఆనందంగా కనిపిస్తుంటారు. ఇప్పుడు ఇక్కడి ఓ బిల్లు బోర్డుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోటో, ఆయనకు సంబంధించిన సమాచారాన్ని డిస్ ప్లే చేశారు. దీంతో తెలంగాణ ప్రవాసులైన ఎన్నారైలు అరుస్తూ కేరింతలు కొట్టారు.
టైం స్క్వేర్ వద్ద రేవంత్ రెడ్డి ఫోటోల ప్రదర్శన. pic.twitter.com/vFner0fkRd
— Telugu Scribe (@TeluguScribe) August 6, 2024
తెలంగాణలోనూ..
అమెరికాలోని టైమ్స్ స్క్వేర్ తరహాలోనే తెలంగాణ స్క్వేర్ పేరుతో ఐకానిక్ నిర్మాణం చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టీజీఐఐసీ ఆధ్వర్యంలో నిర్మాణం చేపట్టాలని సంకల్పించింది. ఆగస్టు 9వ తేదీ వరకు బిడ్ లను సమర్పించడానికి వీలు కల్పించారు. హైదరాబాద్ రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీ సమీపంలో భారీ ప్లాజా నిర్మించాలని ప్రతిపాదించింది. మధ్య, దిగువ తరగతి ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగించేలా ఈ నిర్మాణం ఉండాలని నిర్ణయించారు.
(The above story first appeared on LatestLY on Aug 06, 2024 09:05 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

